ఏపీలో రెండు సెంట్ల స్థల పంపిణీ ప్రారంభం! టీడీపీ హామీ అమలు! అక్కడి నుండే ప్రారంభం..!
Sun Mar 02, 2025 19:52 Politics.202503025158.jpg)
ఏపీలో రెండు సెంట్ల స్థలం పంపిణీ ప్రారంభమైంది. మంత్రి నారాయణ చేతుల మీదుగా నెల్లూరులో 126 కుటుంబాలకు రెండు సెంట్ల స్థలం చొప్పున ఇళ్ల పట్టాలు పంపిణీ చేశారు. రహదారి విస్తరణ పనుల్లో ఇళ్లు, స్థలాలు కోల్పోయిన వారికి ప్రభుత్వం ఇంటి పట్టాలు అందించింది. మరోవైపు ఇళ్లు లేని నిరుపేదలకు గ్రామీణ ప్రాంతాల్లో మూడు సెంట్లు, పట్టణ ప్రాంతాల్లో రెండు సెంట్లు స్థలం పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. దీనిపై ఇప్పటికే ఉత్తర్వులు కూడా విడుదలయ్యాయి.
ఇది కూడా చదవండి: టాటూల వల్ల హెచ్ఐవీ, క్యాన్సర్ ప్రమాదం! ఆరోగ్య శాఖ పరిశోధనల్లో సంచలన విషయాలు!
ఇళ్లు లేని పేదలకు సొంతింటి కోసం ఇళ్ల స్థలాలు అందిస్తామని టీడీపీ కూటమి ఎన్నికల సమయంలో హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. గ్రామీణ ప్రాంతాల్లో మూడు సెంట్లు, పట్టణ ప్రాంతాల్లో రెండు సెంట్ల స్థలం పంపిణీ చేస్తామని మాట ఇచ్చింది. ఇక ఇచ్చిన మాట ప్రకారం ఇళ్ల స్థలాల పంపిణీపై ఏపీ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. దీనిపై మార్గదర్శకాలు కూడా విడుదల చేసింది. అయితే రాష్ట్రంలో తొలిసారిగా నెల్లూరు జిల్లాలో పేదలకు రెండు సెంట్ల స్థలం పంపిణీ చేశారు. నెల్లూరులో మంత్రి నారాయణ చేతుల మీదుగా రెండు సెంట్ల స్థలం పంపిణీ జరిగింది. నెల్లూరులో 126 మంది పేదలకు ఇళ్ల పట్టాలను మంత్రి నారాయణ అందజేశారు. రహదారి విస్తరణలో ఇళ్లు, స్థలాలు కోల్పోయిన 126 కుటుంబాలకు మంత్రి రెండు సెంట్ల స్థలం చొప్పున పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా మాట్లాడిన మంత్రి నారాయణ.. సూపర్ సిక్స్ పథకాలను ప్రభుత్వం ఒక్కొక్కటిగా అమలు చేస్తూ వస్తోందని తెలిపారు. ఈ క్రమంలోనే మే నెలలో తల్లికి వందనం ఇవ్వనున్నట్లు వెల్లడించారు. ఇక రాష్ట్ర బడ్జెట్పై వైసీపీవి అర్థం లేని విమర్శలుగా చెప్పిన నారాయణ.. పేదలు, యువత, రైతులు ఇలా అన్ని వర్గాలు ఉపయోగకరంగా ఉండేలా బడ్జెట్ ప్రవేశపెట్టినట్లు వివరించారు. వైసీపీ ఖజానా ఖాళీ చేసినా కూడా పింఛన్ల పెంపు, ఉచిత గ్యాస్ సిలిండర్లు పథకాలను అమలు చేస్తున్నామన్న మంత్రి.. మే నెలలో తల్లికి వందనం కూడా అమలు చేయనున్నట్లు తెలిపారు.
ఇది కూడా చదవండి: నామినేటెడ్ పదవుల భర్తీకి డెడ్లైన్.. పార్టీ నిర్మాణంపై కీలక ఆదేశాలు! చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు!
మరోవైపు నెల్లూరులోని వీఆర్ హైస్కూలును మంత్రి ఆదివారం సందర్శించారు. పాఠశాల పునర్నిర్మాణానికి అవసరమైన ఏర్పాట్లను పరిశీలించారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి వీఆర్ హైస్కూల్ను అత్యాధునిక వసతులతో ప్రారంభించనున్నట్లు చెప్పారు. 1979లో విఆర్సీలో 6500 మంది విద్యార్థులు ఉండేవారన్న మంత్రి నారాయణ.. తర్వాత కళాశాల మూతపడిందని తెలిపారు. 2014లో 300 మంది విద్యార్థులతో జూనియర్ కళాశాల ఏర్పాటు చేశామని.. కానీ వైసీపీ ప్రభుత్వం కళాశాలను పూర్తిగా మూసివేసిందన్నారు. అయితే తాజాగా టీడీపీ కూటమి సర్కారు నర్సరీ నుంచి ఇంటర్మీడియట్ వరకు పునఃప్రారంభించాలని నిర్ణయించినట్లు మంత్రి వెల్లడించారు. నిరుపేద విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నామని నారాయణ వివరించారు.
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
దారుణం హత్య.. హల్చల్ చేస్తున్న న్యూస్.. సూట్కేసులో కాంగ్రెస్ మహిళా కార్యకర్త మృతదేహం!
విద్యార్థులకు లోకేష్ శుభవార్త! లీప్ అమలుపై సమీక్ష.. ఏపీలో ప్రతి నియోజకవర్గంలో..
కూటమిలో అంతర్యుద్ధం వచ్చిందని వైసీపీ మాజీ ఎంపీ! హోంమంత్రి అనిత రివర్స్ పంచ్!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:
#AndhraPravasi #Andhrapradesh #APGovernment #HousingForPoor #TDP #MinisterNarayana #Nellore #LandDistribution #SuperSixSchemes #APBudget #EducationForAll #VRHighSchool
Copyright © 2016 - 20 | Website Design & Developed By : www.andhrapravasi.com
andhrapravasi try to report accurately, we can’t verify the absolute facts of everything posted. Postings may contain fact, speculation or rumor. We find images from the Web that are believed to belong in the public domain. If any stories or images that appear on the site are in violation of copyright law, please email [andhrapravasi@andhrapravasi.com] and we will remove the offending information as soon as possible.